Harish Rao : ప్రజలందరూ ఏకం కాకముందే కండ్లు తెరవండి

Update: 2025-06-24 11:45 GMT

ప్రజలందరూ ఏకం కాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు బంద్ చేస్తున్నారని అన్నారు. 'రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తాని కే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయి. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అధి కారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ప్రస్తుతం గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది.. రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తకముందే కళ్లు తెరవాలి. గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News