పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు

పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2021-02-22 14:09 GMT

పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న్యాయవాద దంపతుల హత్యకేసులో మంథని న్యాయవాదులు పోరాటానికి సిద్ధమయ్యారు.. మంథని కోర్టులో న్యాయవాదులంతా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి మార్చి 1 వరకు విధులకు దూరంగా ఉండనున్నారు.. అలాగే రామగుండం సీపీ సత్యనారాయణకు లీగల్‌ నోటీసులు జారీ చేస్తామంటున్నారు.. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని వారంతా హైకోర్టుకు లేఖ రాయనున్నారు. నిందితుల తరపున ఎవరూ వకాల్తా తీసుకోవద్దని ఇతర బార్‌ అసోసియేషన్లకు లేఖలు రాయాలని న్యాయవాదులంతా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News