TG : డ్రైనేజీ నీళ్లతో ప్లేట్స్ సాఫ్.. యూసుఫ్ గూడ ఉడుపి హోటల్లో నిర్వాకం
హైదరాబాద్ లోని కొన్ని హోటల్స్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మరోసారి బయటపడింది. యూసుఫ్గూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వాకం బయటపడింది. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగతున్నారు.
హోటల్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లుగా పైపుల్లో లీకవుతున్న డ్రైనేజీ నీటితోనే ప్లేట్లు కడుగుడుతున్నా.. హోటల్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు, స్థానికులు పోలీసులకు, మీడియాకు తెలిపారు.