MLA Makan Singh : ఫ్రస్టేషన్లో కవిత మాట్లాడుతుంది : ఎమ్మెల్యే మక్కన్ సింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రస్టేషన్ లో ఉందని, కేసీఆర్ ను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ధర్నాలు చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజాకూర్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, దళితులు, సింగరేణి కవితకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. కేవలం ఇప్పుడు గుర్తింపు కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిందన్నారు. కాళేశ్వరం నోటీసుల్లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కి నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా..? కవితది ఇంటి పంచాయతీ. అమెరికా వెళ్లి వచ్చాక కవితకి జ్ఞానోదయం కలిగినట్లు ఉంది. సొంత పార్టీ నేతలే కవితను దూరం పెడుతున్నారు. టీజీబీకేఎస్ కు కవిత అధ్యక్షురాలు ఉంటే.. ఉద్యోగాల నియామకాలలో అవినీతి మీద వాళ్లలో వాళ్ళే కేసులు పెట్టుకున్నారు. సింగరేణి లో ప్రైవేటు కంపెనీలకు వేలం ఇచ్చిందే వాళ్ళు. ఇప్పటికైనా దమ్ముంటే.. సీబీఐ విచారణ కవిత కోరాలి. సింగరేణిపై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కి తీసుకు వెళ్లి అన్యాయం చేశారు. ఆ నిధులతో స్థానిక అభివృద్ధి జరగాలి.. కానీ ఇతర నియోజకవర్గాలకు మళ్లించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు కాదు.. దూరం నుంచి చూసే హక్కు కూడా కవితకు లేదు. ' అని అన్నారు.