నల్గొండ జిల్లాలో రైతులకు అకాలవర్షంలో పోలీసులు అండగా నిలిచారు. వర్షంతో తడుస్తున్న ధాన్యాన్ని పోలీసులు పరదాలతో కప్పారు. నల్లగొండ జిల్లా ఇబ్రహీంపట్నం ఐకేపీ సెంటర్ వద్ద రైతులు రోడ్డు మీద వడ్లు ఆరబోశారు. అకాల వర్షానికి వడ్లు తడిసిపోతుంటే అటుగా వెళ్తున్న పోలీసులు చూసి రైతులకు సహాయం చేశారు. వడ్లపై పరదాలను కప్పి వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతులకు మద్దతుగా చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.