TG : హైదరాబాద్ కు రానున్న ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం

Update: 2025-06-02 09:45 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ-1గా ఉన్న ఎస్ఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరు కాబోతున్నట్లుగా ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగషన్ టీమ్ కు ముందస్తు సమాచారం అందజేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు ఓ అండర్ టేకింగ్ లెటర్ ను కూడా మెయిల్ ద్వారా పంపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్ కు తిరిగి వస్తానంటూ మాజీ ఎస్ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ మే2న తీర్పును వెలువ రించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభాకర్ రావు సవాలు చేస్తూ మే 9న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే తాను అమెరికా వెళ్లినట్లుగా ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన ప్రభాకర్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదంటూ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. ఆయనకు వీలైనంత త్వరగా పాస్ట్ పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. 

Tags:    

Similar News