మరోసారి దుబ్బాకకు అన్యాయం జరిగింది : రఘునందన్‌రావు

Update: 2020-12-11 12:18 GMT

మరోసారి దుబ్బాకకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. దుబ్బాక పట్ల వివక్షే టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమన్నారు. దుబ్బాకకు కూడా డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు మంజూరు చేయాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేటకు ఎంత వస్తే అంత దుబ్బాకకు రావాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్‌ విమానాశ్రయం అంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే అధికారులు కనీసం చెప్పడం లేదని.. ప్రొటోకాల్‌ పాటించని అంశంలో అధికారులపై ఫిర్యాదు చేస్తానని రఘునందన్‌రావు అన్నారు.


Tags:    

Similar News