ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా శ్రీరామనవమి శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తామన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏప్రిల్ ఆరున జరిపే శోభా యాత్ర రూట్ను బుల్లెట్ బండిపై తిరిగి తనిఖీ చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ను మున్సిపల్ అధికారులకు అందించామన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాచ్ వర్క్ గానీ, ట్రీ కటింగ్, లైట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ప్రత్యేకంగా ప్రతి ఏటా పోలీసుల వల్లే ఇబ్బంది అవుతుందని, కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారని అలాంటివి జరగకుండా చూసుకుందామన్నారు.