Telangana Rajanna Temple : రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

Update: 2025-01-08 07:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణకాశిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి హుండీ ద్వారా కోటి 28 లక్షల ఆదాయం లభించింది. దేవస్థానం హుండీలను ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అధికారులు సిబ్బంది లెక్కించారు. గత ఏడు రోజులకు ఆలయ ఖజానాకు 1 కోటి 28 లక్షల 78 వేల 106 నగదు సమకూరింది. అలాగే బంగారం 305 గ్రాములు, వెండి 8 కిలోల 200 గ్రాములు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయం ఏటికేడు పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News