REVANTH: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి మద్దతు

రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు

Update: 2025-10-07 03:00 GMT

తె­లం­గా­ణ­లో పరి­శ్ర­మ­లు పె­ట్టే­వా­రి­కి ప్ర­భు­త్వం అన్ని రకా­లు­గా మద్ద­తి­స్తుం­ద­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. అమె­రి­కా­కు చెం­దిన ప్ర­ముఖ ఫా­ర్మా సం­స్థ ఎలి లి­ల్లీ ప్ర­తి­ని­ధు­లు సీ­ఎం­తో భేటీ అయ్యా­రు. ఈ భే­టీ­కి ఆ సం­స్థ అధ్య­క్షు­డు ప్యా­ట్రి­న్‌ జా­న్స­న్‌, లి­ల్లీ ఇం­డి­యా అధ్య­క్షు­డు వి­న్సె­లో టు­క­ర్‌, మం­త్రి శ్రీ­ధ­ర్‌ బాబు, ప్ర­భు­త్వ ప్ర­త్యేక కా­ర్య­ద­ర్శి సం­జ­య్‌ తది­త­రు­లు హా­జ­ర­య్యా­రు. హై­ద­రా­బా­ద్‌­లో పరి­శ్రమ ఏర్పా­టు­కు ఎలి లి­ల్లీ ముం­దు­కొ­చ్చిం­ది. రూ.9 వేల కో­ట్ల­తో ప్లాం­టు, క్వా­లి­టీ సెం­ట­ర్‌ ఏర్పా­టు­కు సం­సి­ద్ధత వ్య­క్తం చే­సిం­ది. ఈ సం­ద­ర్భం­గా ఆ సం­స్థ­ను సీఎం అభి­నం­దిం­చా­రు. ఫా­ర్మా పా­ల­సీ­ని ప్ర­భు­త్వం మరింత ముం­దు­కు తీ­సు­కె­ళ్తుం­ద­ని చె­ప్పా­రు. జీ­నో­మ్‌ వ్యా­లీ­లో ఏటీ­సీ సెం­ట­ర్‌ ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని.. అవ­స­ర­మైన సాం­కే­తిక సహ­కా­రం అం­ది­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. ఆనం­ద్ మహీం­ద్రా నే­తృ­త్వం­లో స్కి­ల్‌ యూ­ని­వ­ర్శి­టీ ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని సీఎం వి­వ­రిం­చా­రు.

రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు

హై­ద­రా­బా­ద్‌ రా­య­దు­ర్గం నా­లె­డ్జ్‌ సి­టీ­లో ఎకరా భూమి ఏకం­గా రూ.177 కో­ట్ల­కు అమ్ము­డు­పో­యిం­ది. టీ­జీ­ఐ­ఐ­సీ ని­ర్వ­హిం­చిన వే­లం­పా­ట­లో 7.67 ఎక­రాల భూ­మి­ని ఎం­ఎ­స్‌­ఎ­న్‌ రి­యా­లి­టీ సం­స్థ దక్కిం­చు­కుం­ది. మొ­త్తం రూ.1357 కో­ట్ల­తో ఎం­ఎ­స్‌­ఎ­న్‌ రి­యా­లి­టీ సం­స్థ 7.67 ఎక­రాల భూ­మి­ని దక్కిం­చు­కుం­ది. టీ­జీ­ఐ­ఐ­సీ చరి­త్ర­లో ఇదే రి­కా­ర్డు ధర కా­వ­డం గమ­నా­ర్హం. రా­య­దు­ర్గం నా­లె­డ్జ్‌ సి­టీ­లో ఉన్న 18.67 ఎక­రాల భూ­మి­కి టీ­జీ­ఐ­ఐ­సీ సో­మ­వా­రం వే­లం­పాట ని­ర్వ­హిం­చిం­ది. ఈ మొ­త్తం భూ­మి­ని రెం­డు భా­గా­లు­గా వి­భ­జిం­చిం­ది. 7.67 ఎక­రా­ల­ను ఒక భా­గం­గా, 11 ఎక­రా­ల­ను మరో­భా­గం­గా ఏర్పా­టు చేసి వే­లం­పాట ని­ర్వ­హిం­చిం­ది. 11 ఎక­రా­ల­ను రూ.1,556.5 కో­ట్ల­కు ప్రె­స్టే­జ్‌ రి­య­ల్‌ ఎస్టే­ట్‌ సం­స్థ దక్కిం­చు­కుం­ది. ఎక­రా­ని­కి రూ.141.5 కో­ట్లు చొ­ప్పున ఆ రి­య­ల్‌ ఎస్టే­ట్‌ కం­పె­నీ వేలం పా­డిం­ది. ఎకరా కనీస ధర రూ.101 కో­ట్లు­గా టీ­జీ­ఐ­ఐ­సీ ని­ర్ణ­యిం­చ­గా.. ఇం­దు­లో పలు సం­స్థ­లు పా­ల్గొ­న్నా­యి. 2017లో రా­య­దు­ర్గం నా­లె­డ్జ్‌ సి­టీ­లో ని­ర్వ­హిం­చిన వేలం పా­ట­లో ఎకరం ధర రూ.42.59 కో­ట్లు పల­క­గా.. 2022లో ని­యో­పో­లి­స్‌, కో­కా­పే­ట­లో హె­చ్‌­ఎం­డీఏ ని­ర్వ­హిం­చిన వేలం పా­ట­లో ఎకరం భూమి రూ.100.75 కో­ట్లు పలి­కిం­ది.

Tags:    

Similar News