REVANTH: జూబ్లీహిల్స్ లో మాపై కుట్ర జరుగుతోంది: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్‌-బీజేపీలు ఒక్కటయ్యాయి.. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్న విపక్షాలు

Update: 2025-10-20 03:30 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ­లు చీ­క­టి ఒప్పం­దా­ల­తో కాం­గ్రె­స్ పా­ర్టీ­పై కు­ట్ర­లు చే­స్తు­న్నా­ర­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో 37 శాతం ఓట్లు సా­ధిం­చిన బీ­ఆ­ర్ఎ­స్ ఆ తర్వాత నా­లు­గు నె­ల­ల­కు జరి­గిన పా­ర్ల­మెం­ట్ ఎన్ని­క­ల్లో 15 శా­తా­ని­కి పడి­పో­యిం­ద­ని 22 శాతం బీ­ఆ­ర్ఎ­స్ ఓట్లు ఎవ­రి­కి చే­రా­యి? ఎవ­రె­వ­రి మధ్య­లో అవ­గా­హన ఉంది? ఎవరు ఎవ­రి­ని బల­ప­రు­స్తు­న్నా­రో అర్థం చే­సు­కో­వా­ల­న్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో కూడా ఇదే తతం­గా­న్ని కొ­న­సా­గిం­చా­ల­ని ఈ రెం­డు పా­ర్టీ­లు కు­ట్ర చే­స్తు­న్నా­ర­ని ధ్వ­జ­మె­త్తా­రు. చా­ర్మి­నా­ర్‍ వద్ద ని­ర్వ­హిం­చిన రా­జీ­వ్ గాం­ధీ సద్భా­వన యా­త్ర సం­స్మ­రణ ది­నో­త్స­వం­లో సీఎం పా­ల్గొ­న్నా­రు. గాం­ధీ కు­టుం­బం దే­శం­లో శాం­తి, సా­మ­ర­స్య­త­ను కా­పా­డు­తోం­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. గాం­ధీ­ని హత్య చే­సిన మత­త­త్వ­వా­దు­లు బ్రి­టీ­ష­ర్ల కంటే ప్ర­మా­దం అని పే­ర్కొ­న్నా­రు. మూడు తరా­లు­గా దేశం కోసం గాం­ధీ కు­టుం­బం పని­చే­స్తోం­ద­న్నా­రు. కు­ట్ర­లు, కు­తం­త్రా­లు చేసే వా­రి­ని తి­ప్పి­కొ­ట్టా­ల­న్నా­రు. బీసీ కు­ల­గ­ణన చేసి వం­దే­ళ్ల సమ­స్య­కు పరి­ష్కా­రం చూ­పిం­చాం అని సీఎం రే­వం­త్ రె­డ్డి చె­ప్పు­కొ­చ్చా­రు.

ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం

తె­లం­గా­ణ­లో బీ­ఆ­ర్ఎ­స్‌-బీ­జే­పీ మధ్య చీ­క­టి ఒప్పం­దా­లు ఉన్నా­య­ని, బీ­సీ­ల­కు రి­జ­ర్వే­ష­న్లు రా­క­పో­వ­డా­ని­కి కూడా కా­ర­ణం ఈ రెం­డు పా­ర్టీ­లే­న­ని రే­వం­త్ ధ్వ­జ­మె­త్తా­రు. ఈ కు­ట్ర­ల­న్నిం­టి­ని దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని తె­లం­గా­ణ­ను అభి­వృ­ద్ధి వైపు నడి­పి­ద్దాం అని పి­లు­పు­ని­చ్చా­రు. ఇవాళ ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన రే­వం­త్ రె­డ్డి జర­గ­బో­యే ఎన్ని­క­ల్లో చీ­లిక తీ­సు­కు­రా­వా­ల­ని కు­ట్ర­లు జరు­గు­తు­న్నా­య­ని ఈ కు­ట్ర­లు, కు­తం­త్రా­ల­ను తి­ప్పి­కొ­ట్టా­ల­న్నా­రు. బీ­జే­పీ­కి బీ­ఆ­ర్ఎ­స్ బీ టీమ్ గా మా­రిం­ద­ని ఆరో­పిం­చా­రు. మొ­న్న జరి­గిన పా­ర్ల­మెం­ట్ ఎన్ని­క­ల్లో మహ­బూ­బ్ నగర్, చే­వె­ళ్ల, సి­కిం­ద్రా­బా­ద్, మె­ద­క్, మల్కా­జి­గి­రి, కరీం­న­గ­ర్, ఆది­లా­బా­ద్, ని­జా­మా­బా­ద్ ఈ ఎని­మి­ది స్థా­నా­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ ఓట్లు బీ­జే­పీ­కి పడ్డా­య­ని ఆరో­పిం­చా­రు. 1990లో రా­జీ­వ్ గాం­ధీ సద్భా­వన యా­త్ర చే­శా­ర­ని సీఎం రే­వం­త్ అన్నా­రు.  35 ఏళ్లు­గా రా­జీ­వ్ గాం­ధీ సద్భా­వన కా­ర్య­క్ర­మం జరు­గు­తుం­ద­న్నా­రు.  గత పా­ల­కు­లు అను­మ­తు­లు ఇవ్వ­కు­న్నా పో­రా­డా­మ­ని చె­ప్పా­రు. మత­త­త్వ వా­దు­లు గాం­ధీ­ని చం­పే­శా­ర­ని.. గాం­ధీ­ని చం­పిన వా­ళ్లు బ్రి­టీ­ష్ వా­ళ్ల­కం­టే ప్ర­మా­ద­మ­న్నా­రు రే­వం­త్.   దేశ సమ­గ్ర­త­ను కా­పా­డ­టం­తో ఇం­ది­రా ప్రా­ణా­లు కో­ల్పో­యా­ర­ని చె­ప్పా­రు.  రా­జీ­వ్ గాం­ధీ ఓటు హక్కు వయ­స్సు­ను 18 ఏళ్ల­కు తగ్గిం­చా­ర­ని రే­వం­త్ తె­లి­పా­రు. 

దేశానికి పర్యాయపదం "గాంధీ"

‘రా­జీ­వ్ గాం­ధీ గు­రిం­చి ఎంత చె­ప్పి­నా తక్కు­వే. గాం­ధీ అనే పదం ఈ దే­శా­ని­కి పర్యాయ పదం. అన్ని మతాల సహ­జీ­వ­నం ఎలా స్పూ­ర్తి ఇస్తుం­దో.. గాం­ధీ అనే పదం కూడా అదే స్పూ­ర్తి­ని­స్తుం­ది. గాం­ధీ­ని బ్రి­టి­ష్ వా­ళ్ళు ఏం చే­య­లే­క­పో­యా­రు. స్వా­తం­త్ర్యం వచ్చిన కొ­న్ని రో­జు­ల్లో­నే మత­త­త్వ వా­దు­లు గాం­ధీ­ని హత్య చే­శా­రు. బ్రి­టి­ష­ర్ల కంటే మత­త­త్వ వా­దు­లు ప్ర­మా­ద­క­రం అని గు­ర్తు పె­ట్టు­కో­వా­లి. దేశం కోసం మొ­ద­టి తరం గాం­ధీ.. రెం­డో తరం ఇం­ది­రా గాం­ధీ.. మూడో తరం రా­జీ­వ్ గాం­ధీ దేశం కోసం ప్రా­ణా­లు ఇచ్చా­రు. జా­కీ­ర్ హు­స్సే­న్ స్వ­తం­త్ర పో­రా­టం­లో పా­ల్గొ­న్నా­రు’ అని సీఎం రే­వం­త్ రె­డ్డి తె­లి­పా­రు.

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా...

దేశ భవి­ష్య­త్తు­ను యు­వ­తే ని­ర్ణ­యిం­చా­ల­ని రా­జీ­వ్ గాం­ధీ ఓటు హక్కు వయ­సు­ను 18 ఏళ్ల­కు తగ్గిం­చా­రు. ఇప్పు­డు అదే స్ఫూ­ర్తి­తో చట్ట­స­భ­ల­కు పోటీ చేసే వయ­సు­ను కూడా 21 ఏళ్ల­కు తగ్గిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని రే­వం­త్ రె­డ్డి అభి­ప్రా­య­ప­డ్డా­రు. అం­దు­కే ఎమ్మె­ల్యే­గా పో­టీ­చే­సే అర్హత వయ­సు­ను 21 ఏళ్ల­కు తగ్గి­స్తూ త్వ­ర­లో తె­లం­గా­ణ­లో రె­జ­ల్యూ­ష­న్ తీ­సు­కు­వ­స్తా­మ­ని చె­ప్పా­రు. ఈ వి­ష­యం­లో పా­ర్ల­మెం­టు­లో చట్ట­స­వ­రణ చే­స్తే రా­జ­కీ­యా­ల్లో యువత మరింత క్రి­యా­శీ­ల­కం­గా మా­రు­తుం­ద­ని చె­ప్పా­రు. ‘రా­జీ­వ్ గాం­ధీ స్పూ­ర్తి­తో రా­హు­ల్ గాం­ధీ భా­ర­త్ జోడో యా­త్ర చే­శా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం­లో మత­సా­మ­ర­స్యం కా­పా­డు­తాం అని చా­ర్మి­నా­ర్ ముం­దు రా­హు­ల్ గాం­ధీ మాట ఇచ్చా­రు. చె­ప్పి­న­ట్టు­గా­నే కుల గణన చే­శాం. 8 సీ­ట్ల­లో బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి డి­పా­జి­ట్ పో­యిం­ది. ఆ 8 సీ­ట్ల­లో బీ­జే­పీ గె­లి­చిం­ది. అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో వచ్చిన ఓట్లు.. పా­ర్ల­మెం­ట్కి వచ్చే సరి­కి ఇటు పో­యా­యి. జూ­బ్లి­హి­ల్స్ ఎన్ని­క­ల్లో కూడా కు­ట్ర జరు­గు­తుం­ది’ అని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. కాం­గ్రె­స్ నేత సల్మా­న్ ఖు­ర్షీ­ద్‌­కు రా­జీ­వ్ గాం­ధీ సద్భా­వన అవా­ర్డు­ను సీఎం ప్ర­ధా­నం చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా రా­జీ­వ్ సద్భా­వన అవా­ర్డు­ను సల్మా­న్ ఖు­ర్షీ­ద్‍కు ప్ర­ధా­నం చే­శా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో మం­త్రు­లు పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్ రె­డ్డి, ఉత్త­మ్ , పీ­సీ­సీ చీఫ్ మహే­శ్ కు­మా­ర్ రె­డ్డి, వీ­హె­చ్, ఏఐ­సీ­సీ నేత సల్మా­న్ ఖు­ర్షీ­ద్ పా­ల్గొ­న్నా­రు.

Tags:    

Similar News