REVANTH: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టీకరణ.. ప్రక్షాళనా చేయాలా వద్దా..? అంటూ సూటి ప్రశ్న.. మొదట 21 కిలోమీటర్లు ప్రక్షాళన చేస్తామని వెల్లడి

Update: 2026-01-02 10:30 GMT

ఎవరు అడ్డు­ప­డ్డా ఎట్టి పరి­స్థి­తు­ల్లో మూసీ ప్ర­క్షా­ళన చే­స్తా­మ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు.మూసీ ప్ర­క్షా­ళ­న­పై అసెం­బ్లీ­లో మా­ట్లా­డిన రే­వం­త్.. 2026 మా­ర్చి­లో మూసీ ఫస్ట్ ఫేజ్ పను­ల­ను ప్రా­రం­భి­స్తా­మ­ని చె­ప్పా­రు. గం­డి­పే­ట్ నుం­చి బాపూ ఘాట్ వరకు మొదట 21 కి.మీ మూసీ ప్ర­క్షా­ళన చే­స్తా­మ­ని చె­ప్పా­రు.సం­క్రాం­తి లోగా ఫస్ట్ ఫేజ్ డీ­పీ­ఆ­ర్ పై క్లా­రి­టీ వస్తుం­ద­న్నా­రు. ఈ పను­ల­కు ఏడీ­బీ బ్యాం­కు రూ.4 వేల కో­ట్ల రుణం ఇచ్చేం­దు­కు అం­గీ­క­రిం­చిం­ద­ని తె­లి­పా­రు. గతం­లో జల­వ­న­రు­ల­ను కా­పా­డు­కొ­నే ప్ర­య­త్నా­లు జర­గ­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. మూసీ నది ప్ర­క్షా­ళ­న­పై తె­లం­గాణ అసెం­బ్లీ­లో వాడీ వే­డీ­గా చర్చ జరి­గిం­ది. ఈ వి­ష­యం­పై మా­ట్లా­డిన సీఎం రే­వం­త్ రె­డ్డి.. గు­జ­రా­త్ సబ­ర్మ­తి, గంగా, యము­నా నదుల ప్రా­జె­క్టు­ల­ను ఉదా­హ­రి­స్తూ.. మూసీ పు­న­రు­ద్ధ­రణ ఆవ­శ్య­కత గు­రిం­చి చె­ప్పా­రు. అం­దు­లో భా­గం­గా తొలి దశలో మా­ర్చి 31 లోగా.. 21 కిలో మీ­ట­ర్ల మేర మూసీ ప్ర­క్షా­ళన పను­లు మొ­ద­లు­పె­ట్ట­ను­న్న­ట్లు తె­లి­పా­రు. అదే వి­ధం­గా 51 కి.మీ. ఎలి­వే­టె­డ్ కా­రి­డా­ర్లు కూడా ని­ర్మి­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి ప్ర­క­టిం­చా­రు. సం­క్రాం­తి­లో­గా డీ­పీ­ఆ­ర్‌­పై స్ప­ష్టత వస్తుం­ద­ని చె­ప్పా­రు. గం­డి­పేట, హి­మా­య­త్‌­సా­గ­ర్‌ నుం­చి గాం­ధీ సరో­వ­ర్‌ వరకు తొలి దశ మూసీ నది అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని చె­ప్పా­రు. 2026 మా­ర్చి 31 కల్లా తొలి దశ పను­లు ప్రా­రం­భి­స్తా­మ­ని సీఎం వె­ల్ల­డిం­చా­రు. కాగా, సం­క్రాం­తి­లో­గా మొ­ద­టి దశ మూసీ పు­న­రు­ద్ధ­రణ ప్రా­జె­క్టు డీ­పీ­ఆ­ర్‌­పై.. స్ప­ష్టత ఇస్తా­మ­న్నా­రు. కాగా, నా­బా­ర్డ్ నుం­చి తీ­సు­కు­న్న రూ.4,100 కో­ట్ల­తో ఈ పను­లు చే­ప­ట్ట­ను­న్న­ట్లు తె­లు­స్తోం­ది.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు..

తె­లం­గా­ణ­లో మూసీ నది 240 కి­లో­మీ­ట­ర్లు ప్ర­వ­హి­స్తుం­ద­ని చె­ప్పా­రు సీఎం రే­వం­త్. అనం­త­గి­రి హి­ల్స్ నుం­చి వా­డ­ప­ల్లి వరకు మూసీ ప్ర­వా­హం ఉం­ద­ని.. అం­దు­కే మూసీ, ఈసీ నదు­లు కలి­సే ప్ర­దే­శం­లో బా­పు­ఘా­ట్‌ ని­ర్మి­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. అక్కడ గాం­ధీ సరో­వ­ర్ ప్రా­జె­క్ట్ చే­ప­ట్టా­ని వె­ల్ల­డిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా నదీ పరి­వా­హక ప్రాం­తం­లో­నే అభి­వృ­ద్ధి జరు­గు­తుం­ద­ని సీఎం నొ­క్కి చె­ప్పా­రు. ఇక జల­వ­న­రు­ల­ను కలు­షి­తం చేసి, కబ్జా­లు చేసి ఫాం­హౌ­స్‌­లు ని­ర్మిం­చా­ర­ని.. వాటి డ్రై­నే­జీ­ల­ను జంట జలా­శ­యా­ల­కు కలి­పా­ర­ని ప్ర­తి­ప­క్షా­ల­పై రే­వం­త్ మం­డి­ప­డ్డా­రు. అం­దు­కే ఆ డ్రై­నే­జీ­ల­ను కూ­ల­గొ­ట్టి, కబ్జా­ల­పై చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి తె­లి­పా­రు. " మూసీ వల్ల నల్గొండ జి­ల్లా ప్ర­జ­లు శి­క్ష అను­భ­వి­స్తు­న్నా­రు.ఫ్లో­రై­డ్ పా­పా­ని­కి తోడు, మూసీ వల్ల నల్గొండ ప్ర­జ­లు చే­తు­లు,కా­ళ్లు, నడు­ము వం­క­ర­తో నర­క­యా­తన అను­భ­వి­స్తు­న్నా­రు.. సి­టీ­లో­ని మూసీ ము­రు­గు­తో నల్గొండ ప్ర­జ­లు ఇబ్బం­ది­ప­డు­తు­న్నా­రు.. ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ మూసీ ప్ర­క్షా­ళన చేసి తీ­రు­తాం. ఢి­ల్లీ­లో యము­నా నది అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని బీ­జే­పీ హామీ ఇచ్చిం­ది. మేం ఏ అభి­వృ­ద్ధి చర్య­ల­ను వ్య­తి­రే­కిం­చ­డం లేదు.ని­ర్వా­సి­తు­ల­కు మె­రు­గైన వస­తు­లు, సౌ­క­ర్యా­లు కల్పి­స్తు­న్నాం. మూసీ అభి­వృ­ద్ధి జరి­గిం­ది అంటే ని­జాం కా­లం­లో­నే . ’ అని రే­వం­త్ తె­లి­పా­రు.

బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం

అసెం­బ్లీ శీ­తా­కాల సమా­వే­శా­ల­ను బా­యి­కా­ట్ చే­యా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు మాజీ మం­త్రి హరీ­ష్ రావు ప్ర­క­టిం­చా­రు. గన్‌­పా­ర్క్‌ వద్ద మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. అసెం­బ్లీ శీ­తా­కాల సమా­వే­శా­ల­ను బహి­ష్క­రిం­చా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ ని­ర్ణ­యం తీ­సు­కుం­ద­న్నా­రు. స్పీ­క­ర్, ప్ర­భు­త్వ వై­ఖ­రి­కి ని­ర­స­న­గా అసెం­బ్లీ సమా­వే­శా­ల­ను బాయ్ కాట్ చే­స్తు­న్నా­మ­ని మాజీ మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. అసెం­బ్లీ తీరు చూ­స్తుం­టే శా­స­న­సభ ని­బం­ధ­న­ల­కు వి­రు­ద్ధం­గా ఉం­ద­ని మం­డి­ప­డ్డా­రు. బీ­ఏ­సీ మీ­టిం­గ్‌­కు ప్ర­భు­త్వం తర­పున గం­ట­న్నర లే­టు­గా వచ్చా­ర­ని.. అసెం­బ్లీ­లో ప్ర­తి­ప­క్ష సభ్యు­ల­కు మా­ట్లా­డే అవ­కా­శం ఇవ్వ­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. సీఎం రే­వం­త్ రె­డ్డి అసెం­బ్లీ­ని బూ­తు­ల­మ­యం చే­శా­ర­ని మం­డి­ప­డ్డా­రు. అసెం­బ్లీ­లో ప్ర­ధాన ప్ర­తి­ప­క్ష పా­ర్టీ­కి మైక్ ఇవ్వ­రా అని ప్ర­శ్నిం­చా­రు. పా­ర్ల­మెం­టు­లో నరేంద్ర మో­దీ­ని రా­హు­ల్ గాం­ధీ తి­ట్ట­డం­లే­దా అని ని­ల­దీ­శా­రు.

Tags:    

Similar News