TGRTC : ఆర్టీసీలో కొత్త బాదుడు.. ప్యాసింజర్లు లబోదిబో

Update: 2025-06-20 07:15 GMT

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా టోల్‌ ట్యాక్స్‌ పెంచిందన్న సాకుతో ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ గేట్లు ఉన్న రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల నుంచి టోల్‌గేటుకు రూ.10 చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. తాజాగా రేషనలైజేషన్‌ పేరిట రాష్ట్రంలోని అన్ని రకాల ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసుల్లో టికెట్‌ రేట్లను రూ.10 పెంచింది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే మూడు టోల్‌గేట్లు దాటాల్సి ఉండటంతో ఇప్పటికే ఉన్న టికెట్‌ రేటుకు అదనంగా ఆర్టీసీ ప్రయాణికుల నుంచి రూ.30 వసూలు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి రామగుండం వెళ్లే మార్గంలోనూ 3 టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ మార్గంలోనూ ప్రయాణికుల నుంచి అదనంగా రూ.30వసూలు చేస్తున్నారు. తాజాగా కిలోమీటర్ల రేషనలైజేషన్‌ పేరిట అన్ని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో టికెట్ల రేట్లను ప్రస్తుత చార్జీలతో సంబంధం లేకుండా రూ.10చొప్పున పెంచారు.

Tags:    

Similar News