నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న రెండు ముఠాలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. హైదరాబాద్ లోని మెహి దీపట్టణం కేంద్రంగా కొందరు నకిలీ విత్తనాల దందాకు తెరలేపారు. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల్లోని రైతులకు వాటిని అంటగట్టేందుకు కొంత మందిని ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రకారం వరంగల్ జిల్లా పరిధిలోని పరకాల, గీసుకొండ మండలాల పరిధిలో రెండు ముఠాలు నకిలీ విత్తానాలకు రైతులకు విక్రయిస్తున్న ట్లు సమాచారం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహకారంతో వారి గుట్టురట్టు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందు, నకిలీ పురుగుల మందుల తయారీకి అవసరమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.63.62 లక్షలు ఉంటుందని చెప్పారు.