వెనుక బడిన వర్గాలు, బీసీల గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు తెంలగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారని మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారని విమర్శించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ధర్నా చేయాలన్నారు. లిక్కర్ స్కాంలో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు బండ్రు శోభారాణి.