తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదిక ద్వారా దివ్యాంగులను అవమానపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు.
దివ్యాంగులకు ఎందుకు రిజర్వేషన్ కోట ఇవ్వాలని ప్రశ్నించడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు నాగేశ్వర రావు. ఈ విషయమై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్మితా సబర్వాల్ తీరుపై రాష్ట్ర సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
దివ్యాంగులను అవమాన పరిచిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను పోలీస్ శాఖ సుమోటో కేసుగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం 92వ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.