తెలంగాణలో బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సమ్మర్ సీజన్కు తోడు ఐపీఎల్ ఉండటంతో రోజుకు 3లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. IPL ప్రారంభమైన మార్చి 22వరోజు ఏకంగా 4లక్షల కాటన్ల బీర్లు సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పెరిగిన డిమాండ్ తీర్చడానికి బీర్ సరఫరా సంస్థలు సైతం ఉత్పత్తిని పెంచాయి. లిక్కర్ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కొనసాగుతోంది. వివాహ వేడుకలు, రిసెప్షన్ల వంటి శుభకార్యాల్లో బీర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో బీర్ సరఫరా చేసే కంపెనీలు డిమాండ్ను అందుకోవడానికి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్లు కూడా బీర్ల అమ్మకాలకు మరింత ఊతమిస్తున్నాయి. బార్లు, పబ్లు, రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత కనిపిస్తున్నారు. మ్యాచ్ చూస్తూ బీర్ తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.