TG : మల్ రెడ్డితో చర్చలు సఫలం

Update: 2025-06-09 06:00 GMT

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉందని, ఆయన అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. మంత్రిగా అవకాశం రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తానని అలకబూనిన మల్రెడ్డి రంగారెడ్డితో పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం చర్చలు జరిపారు. రాజీనామా ఆలోచన విరమించుకునేలా చేశారు. భేటీ అనంతరం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోరడం సమంసజమేనని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా రాష్ట్ర జనాభాలో శాతం ఉంటుందని, ఇంత పెద్ద జనాభా ఉన్న ప్రాంతానికి మంత్రి వర్గంలో స్థానం అవసరమేనన్నారు. ఈ విషయాన్ని అధి ష్టానం దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News