BONALU: సంబురాల సింగారాలు.. తెలంగాణ బోనాలు

నేడు గోల్కొండ అమ్మవారికి బోనం...సిద్ధమైన అమ్మవారి ఆలయాలు;

Update: 2025-06-26 01:30 GMT

తె­లం­గా­ణ­లో ఆషాఢ మాసం బో­నాల పం­డుగ సం­ద­డి నేటి నుం­చి ఆరం­భం కా­నుం­ది. పల్లె, పట్నం అని తేడా లే­కుం­డా ఆషాఢ బో­నా­లు వే­డు­క­గా జరు­గు­తా­యి. పం­డుగ రో­జున గ్రామ దే­వ­త­లైన ఎల్ల­మ్మ, పో­చ­మ్మ, పో­త­రా­జు వే­షా­లు, శి­వ­స­త్తు­లు‌, డప్పుల చప్పు­ళ్లు వం­టి­వి ఎటు చూ­సిన కని­పి­స్తా­యి. అసలు ఈ బో­నా­లు అనే మాట ఎత్త­గా­నే మొదట గు­ర్తొ­చ్చే­ది మా­త్రం పు­రా­తన చరి­త్ర కలి­గిన హై­ద­రా­బా­ద్‌ బో­నా­లే. ఈ పం­డుగ తె­లం­గాణ సం­స్కృ­తి­కి ప్ర­తీ­క­గా ని­లు­స్తుం­ది. ఈ బో­నా­లు ఉత్స­వా­ల­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం రా­ష్ట్ర పం­డు­గ­గా గు­ర్తిం­చి ని­ర్వ­హి­స్తోం­ది. ఆషా­ఢ­మా­సం­లో ఒక్కో వా­రం­లో ఒక్కో ప్రాం­తం­లో జరి­గే బో­నా­లు అం­త­ర్జా­తీ­యం­గా కూడా ఖ్యా­తి­కె­క్కిం­ది. తె­లం­గా­ణ­లో బో­నాల పం­డుగ కే­వ­లం ఆషాఢ మా­సం­కే పరి­మి­తం కా­లే­దు. పలు సం­ద­ర్భా­ల్లో వే­ర్వే­రు రకాల బో­నాల ని­ర్వ­హణ ఇక్కడ కని­పి­స్తుం­ది. కుం­డ­లో బోనం వండి దే­వ­త­ల­కు నై­వే­ద్యం పె­ట్టే సం­ప్ర­దా­యం ఉంది. పం­ట­లు బాగా పం­డా­ల­ని, ఆరో­గ్యా­లు బా­గుం­డా­ల­ని ప్ర­కృ­తి­కి తె­లి­పే ఒక రక­మైన కృ­త­జ్ఞ­తా­భా­వం. ఈ బో­నా­లు పం­డు­గ­లో మహి­ళ­ల­దే కీలక పా­త్ర. ఈ పం­డు­గ­లో­ని ఆచార, సం­ప్ర­దా­యా­లు మహిళ కేం­ద్రం­గా ఉం­టా­యి. వర్షా­కా­లం ప్రా­రం­భం­లో వచ్చే వ్యా­ధు­ల­ను అరి­క­ట్టే­లా కొ­న్ని ఆరో­గ్య సూ­త్రా­లు కూడా ఈ పం­డు­గ­లో దాగి ఉన్నా­య­నే­ది జా­న­పద చరి­త్ర­కా­రుల అభి­ప్రా­యం.

శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

అమ్మ­వా­రి ఆశీ­స్సు­ల­తో ప్ర­జ­లం­ద­రూ సుఖ శాం­తు­ల­తో, ఆయు­రా­రో­గ్యా­ల­తో జీ­విం­చా­ల­ని తె­లం­గాణ రా­ష్ట్రం­లో వర్షా­లు సమృ­ద్ధి­గా కు­రి­సి పం­ట­లు బాగా పం­డా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి కో­రు­కు­న్నా­రు. రా­ష్ట్రం అన్ని రం­గా­ల్లో పు­రో­గ­తి సా­ధిం­చే ది­శ­గా అమ్మ­వా­రి దీ­వె­న­లు ఉం­డా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఆకాం­క్షిం­చా­రు. ఆషాడ మాసం బో­నాల ఉత్స­వా­ల­తో తె­లం­గా­ణ­లో పం­డుగ వా­తా­వ­ర­ణం మొ­ద­ల­వు­తుం­ద­ని అన్నా­రు. తె­లం­గాణ సం­స్కృ­తి సం­ప్ర­దా­యా­ల­కు ప్ర­తీ­క­గా ని­లి­చే బో­నాల పం­డు­గ­ను ప్ర­తి ఒక్క­రూ భక్తి శ్ర­ద్ధ­ల­తో జరు­పు­కో­వా­ల­ని ఆకా­క్షిం­చా­రు. చా­రి­త్రా­త్మక గో­ల్కొం­డ­లో వె­ల­సిన జగ­దాం­బిక ఎల్ల­మ్మ తల్లి­కి ఆషాడ మాసం తొలి బోనం సమ­ర్పిం­చ­డం­తో జం­ట­న­గ­రా­ల్లో బో­నాల సం­ద­డి నె­ల­కొం­టుం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. ఈ మే­ర­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఓ ప్ర­క­టన వి­డు­దల చే­శా­రు.

Tags:    

Similar News