ఈనెల 14 న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న యదాద్రి పర్యటను వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

Update: 2021-09-12 09:03 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న యదాద్రి పర్యటను వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్‌రెడ్డి శనివారం యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో ఎన్‌ గీత తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News