TG: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం

మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. వరంగల్ జిల్లాలో ఎడతెరపిలేని వానలు.. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఏకధాటి వర్షం

Update: 2025-10-30 04:30 GMT

మొం­థా తు­ఫా­న్‌ ప్ర­భా­వం­తో తె­లం­గాణ రా­ష్ట్ర వ్యా­ప్తం­గా వా­తా­వ­ర­ణం పూ­ర్తి­గా మా­రి­పో­యిం­ది. అన్ని జి­ల్లా­ల్లో భారీ వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. హన్మ­కొండ, హై­ద­రా­బా­ద్‌, జన­గాం, కరీం­న­గ­ర్‌, ఖమ్మం, మహ­బూ­బా­బా­ద్‌, మహ­బూ­బ్‌­న­గ­ర్‌, మే­డ్చ­ల్‌-మల్కా­జ్‌­గి­రి, నా­గ­ర్‌­క­ర్నూ­లు, నల్గొండ, నా­రా­య­ణ­పే­ట్‌, రం­గా­రె­డ్డి, సి­ద్ది­పే­ట్‌, సూ­ర్యా­పే­ట్‌, వి­కా­రా­బా­ద్‌, వన­ప­ర్తి, వరం­గ­ల్‌, యా­దా­ద్రి-భు­వ­న­గి­రి జి­ల్లా­ల్లో భారీ వర్షం కు­రి­సిం­ది. భారీ వర్షాల నే­ప­థ్యం­లో మహ­బూ­బ్‌­న­గ­ర్, మహ­బూ­బా­ద్, ఖమ్మం, నల్ల­గొండ, సూ­ర్యా­పేట జి­ల్ల­ల్లో­లఅ­న్ని ప్ర­భు­త్వ, ప్రై­వే­టు పా­ఠ­శా­ల­ల­కు సె­ల­వు ప్ర­క­టిం­చా­రు. ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని, అవ­స­రం లే­కుం­డా బయ­ట­కు వె­ళ్ల­రా­ద­ని అధి­కా­రు­లు సూ­చిం­చా­రు.

అత్యధికంగా 20.8 సెం.మీ వర్షపాతం

నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌ జి­ల్లా ఉప్పు­నుం­త­ల­లో అత్య­ధి­కం­గా 20.8 సెం.మీ. వర్ష­పా­తం నమో­దైం­ది. నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌ జి­ల్లా అమ్రా­బా­ద్‌­లో 19.7 సెం.మీ, నల్గొండ జి­ల్లా తె­ల్దే­వ­ర­ప­ల్లి­లో 18.5 సెం.మీ, నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌ జి­ల్లా వె­ల్టూ­ర్‌­లో 18.3 సెం.మీ, ఐనో­లు­లో 17.8 సెం.మీ, నల్గొండ జి­ల్లా ఎర్రా­రం­లో 15.1, పో­లే­ప­ల్లి­లో 13.3 సెం.మీ, రం­గా­రె­డ్డి జి­ల్లా వె­లి­జా­ల­లో 13.9, వన­ప­ర్తి జి­ల్లా రే­వ­ల్లి­లో 12.6, మి­డ్జి­ల్‌­లో 11.9 సెం.మీ వర్ష­పా­తం నమో­దైం­ది.  దీం­తో పలు ప్రాం­తా­లు నీట ము­ని­గా­యి.. లో­తు­ట్టు ప్రాం­తా­ల్లో­కి నీరు చే­ర­డం­తో జన­జీ­వ­నం అస్త­వ్య­స్తం­గా మా­రిం­ది.. వా­గు­లు వం­క­లు పొం­గి­పొ­ర్లు­తు­న్నా­యి.. తె­లం­గాణ మహ­బూ­బా­బా­ద్‌ జి­ల్లా­లో రైలు పట్టా­ల­పై­కి వరద నీరు చే­ర­డం­తో అధి­కా­రు­లు అప్ర­మ­త్త­మ­య్యా­యి.. డో­ర్న­క­ల్‌ రై­ల్వే­స్టే­ష­న్‌­లో పట్టాల పై­నుం­చి వర­ద­నీ­రు ప్ర­వ­హి­స్తుం­డ­టం­తో రై­ళ్ల రా­క­పో­క­లు ని­లి­చి­పో­యా­యి. డో­ర్న­క­ల్‌ రై­ల్వే­స్టే­ష­న్‌­లో గో­ల్కొండ ఎక్స్‌­ప్రె­స్‌, మహ­బూ­బా­బా­ద్‌­లో కో­ణా­ర్క్‌ ఎక్స్‌­ప్రె­స్‌­ల­ను రై­ల్వే అధి­కా­రు­లు ని­లి­పి­వే­శా­రు. తు­ఫా­న్ ప్ర­భా­వం­తో హై­ద­రా­బా­ద్ లో ఎడ­తె­రి­పి లే­కుం­డా వర్షం కు­రు­స్తోం­ది. తె­లు­గు రా­ష్ట్రా­ల్లో భీకర వర్షా­లు కు­రు­స్తు­న్న వేళ ప్ర­భు­త్వా­లు పూ­ర్తి అప్ర­మ­త్త­తో ఉన్నా­యి. అధి­కా­రు­లు హై అలె­ర్ట్ లో ఉం­డా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­యి.

భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ వేర్వేరు ప్రకటనల్లో కోరారు.మత్స్యకారులు, ప్రజలు ఎవరూ కూడా జలాశయాల వద్దకు వెళ్లొద్దని కోరారు.

Tags:    

Similar News