మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలున్నాయి - రేవంత్‌ రెడ్డి

Revanth Reddy:రాజయ్య, ఈటలకు ఒకనీతి.. మల్లారెడ్డికి మరో నీతా అంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.

Update: 2021-08-27 13:00 GMT

రాజయ్య, ఈటలకు ఒకనీతి.. మల్లారెడ్డికి మరో నీతా అంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. మంత్రి మల్లారెడ్డి అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయన్నారు. మంత్రి మల్లారెడ్డి.. 50 ఎకరాల లే ఔట్‌ చేసిన వ్యాపారిని బెదిరించినట్లుగా ఆధారాలు బయటకు వచ్చాయన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నట్లుగా ఆడియోలు బయటపడ్డాయన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించలేదని రేవంత్ మండిపడ్డారు.

మల్లారెడ్డి బావమరిదికి 16 ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ అయ్యిందని.. ఆ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ తెచ్చుకున్నారని ఆరోపించారు. గుండ్ల పోచమ్మపల్లిలో 22 ఎకరాల భూమి ఉందని... 2000-01 పహానిలో విభజన తర్వాత 22 ఎకరాల భూమి ఉన్నట్లు వుందన్నారు. ఈ భూమి 22 ఎకరాల 26 గుంటలు ఎలా అయ్యిందని రేవంత్ ప్రశ్నించారు.

Tags:    

Similar News