భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ ఛార్మినార్‌ వద్ద భోగివేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2021-01-13 05:21 GMT

హైదరాబాద్‌ ఛార్మినార్‌ వద్ద భోగివేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు భోగి, సంక్రాతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారీ పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఛాయ్‌ కేఫ్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత ..అక్కడ  స్థానికులతో కలిసి టీ తాగారు.

Tags:    

Similar News