GHMC ఎన్నికల్లో మళ్లీ TRSదే విజయమన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. హైద్రాబాద్ ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించడంలో ప్రభుత్వం ముందుందన్నారు. అత్యాధునిక హంగులతో వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.. గ్రేటర్లో వెయ్యి అధునాతన బస్ షెల్టర్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. దిల్సుఖ్నగర్లో నూతనంగా నిర్మించిన ఆధునిక బస్ షెల్టర్లను మేయర్ ప్రారంభించారు.