యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 250మంది పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, బట్టలు పెట్టి సత్కరించారు బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించడం హిందూ సాంప్రదాయమని, అందులో భాగంగా ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసే పారిశుధ్య కార్మికులను మహిళా దినోత్సవం రోజున సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.