తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.. కరోనా తీవ్రతతో సమావేశాలను ముందే ముగించారు. 8 రోజుల్లో మొత్తం 12 బిల్లులకు ఆమోదం తెలిపిందిన సభ. ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు.. అసెంబ్లీ సిబ్బంది, 13 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడటంతో.. సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్తగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.