టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం..

తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కానుంది. తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు.. పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2021-04-07 12:30 GMT

తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కానుంది. తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు.. పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓ లేఖ అందించారు. అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. కాసేపట్లో టీడీపీ విలీనంపై అసెంబ్లీ కార్యదర్శి అధికారిక బులెటిన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News