స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. చంద్రబాబు పాలనలో స్థానిక సంస్థలు ఎన్నో అవార్డులు సాధించాయని చెప్పారు. కేపీహెచ్బీ డివిజన్లోని వసంనగర్లో టీడీపీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఎల్.రమణ ప్రారంభించారు. మేయర్ హమారా నినాదంతో మేయర్ ఎన్నికలో మార్పు తెచ్చామని తెలిపారు. చంద్రబాబు విజన్ 2020 ద్వారా సైబరాబాద్ను అభివృద్ధి చేశారని చెప్పారు.