సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ పై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది వానర సేన. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందువులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. శాంతియుతంగా జరుగుతున్న బంద్ లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి హిందువులను గాయపరిచారని పిటిషన్ లో ఆరోపించారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులను బాధ్యులని చేసి సస్పెండ్ చేయాలని HRCలో ఫిర్యాదు చేశారు వానరసేన సభ్యులు.