తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఆలయ దేవస్థానం అధికారులు నరసింహస్వామి భక్తులకు షాక్ ఇచ్చారు. వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యాదాద్రిలో వ్రతం టికెట్ ధర రూ. 800గా ఉండగా.. దాన్ని ఇప్పుడు రూ.1000కి పెంచారు. అన్నవరం తర్వాత భక్తులు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే వ్రతాలు చేయించుకుంటారు. ఇప్పుడీ టికెట్ రేటు పెంచడంతో భక్తులు మండిపడుతున్నారు.