తెలంగాణలో ఆర్థికంగా భారమైనా కులగణన చేపడుతున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్గాంధీ చెప్పారనీ... ఆయన చెప్పిన మాట ప్రకారం కులగణన చేస్తున్నట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే తో ఎవరికి ఏం అవసరమనేది ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. 75 కాలమ్స్తో కులగణన సర్వే చేపట్టినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.