Konda Surekha : ప్లాస్టిక్ రహిత స్టార్టప్లను ప్రోత్సహిస్తం : మంత్రి కొండా సురేఖ
గ్లోబర్ వార్మింగ్ నేడు ప్రపంచానికే పెద్ద సవాల్గా మారిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ పీసీబీ లయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భం గా నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు.. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 12.65 కోట్ల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారని చెప్పారు. ప్లాస్టిక్ మనషులకే కాదు.. జంతువులకూ ప్రమాదంగా మారిందన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. గత ఏడాది 20.2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా 19.04 కోట్ల మొక్కలను నాటిన్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా వనమహోత్సవంను భారీ ఈ స్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 'పర్యావరణ మెరుగు పరిచేందుకు ప్రభుత్వం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజం, పార్కుల్లో కీలక మార్పులు చేపడుతున్నం. సింగిల్ యూస్ ప్లా స్టిక్లను తొలగించి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. అందుకోసం తమ ప్రజా ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుంది. ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడం, అనేథీమ్ తో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటు న్నం. రాష్ట్రం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ను వినియోగిస్తున్న చేస్తున్న స్టార్టప్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తు న్నం.' అని కొండా సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పీసీబీ బోర్డు మెంబర్లు సత్యనారా యణరెడ్డి, విజయలక్ష్మీ, జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.