'నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను' అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి దివాలాకోరు మాటలతో తెలంగాణను అవమానిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ 'స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యో గుల త్యాగాల గురించి ఆయనకు ఇసుమంత కూడా తెలియదు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యో గులు అడుగుతున్నారు. ప్రజల ముందు ఉద్యోగులను విలన్ లుగా చిత్రీకరించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నా డు. అందాల పోటీలకు 200 కోట్లు ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు ఇవ్వటానికి డబ్బులు లేవా? నాయకత్వ లోపం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం. తండ్రిలాంటి ముఖ్యమంత్రే సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం స్వతంత్ర భారతదేశంలో లేదు. కాంగ్రెస్ మ్యా నిఫెస్టో ఈ శతాబ్దపు మోసం. వ్యక్తిగతంగా మాపై రోత మాటలను సైతం పడ్డాం.. తెలంగాణను శపిస్తే సహించం. పరిపాలన చేతగాదని.. సీఎం రేవంత్రెడ్డి కాడి కిందపడేశారు. నోట్ల కట్లతో దొరికిన రేవంత్ రెడ్డి.. దొంగ కాక మరేంటి? ఆయన దొంగ కాబట్టే.. అప్పు పుట్టడం లేదు' అని అన్నారు. 'కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ.. దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. రేవంత్ ను సీఎం చేసి.. ఏఐసీసీ, రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు. తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లా డారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే మోసపోతామన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయి. ఇంత దివాలాకోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. అధికారంలోకి వస్తామని.. కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. అందుకే విచ్చల విడిగా హామీలు ఇచ్చింది' అని కేటీఆర్ అన్నారు.