K Kesava Rao : పాక్ పై యుద్ధం గెలిచే అవకాశం బీజేపీ ఎందుకు కోల్పోయింది : కేకే
జై హింద్ సభలో సీఎం రేవంత్రెడ్డి దేశం గర్వించేలా మాట్లాడారని ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అన్నారు. ఆయన మాటలకు కేంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జవాబు ఇవ్వాలన్నారు. ఇండియా-పాక్ యుద్ధ వాతావరణంపై పెద్దగా చూపించారని, ఆపరేషన్ సిందూర్ పై అఖిలపక్షం అభిప్రాయం తీసుకంటే దేశమంతా కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. యుద్ధ సమయంలో కావలసిన యుద్ధ సామగ్రి ఇవ్వడం లేదని నేవీ చీఫ్ చెప్పారన్నారు. యుద్ధం ఆగిపోయిన తర్వాత ఎన్ని ఇండియన్ యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సీజ ఫైర్కు ట్రంప్ కు సంబంధం ఏమిటన్నారు. కాల్పుల విమరణ ప్రకటన చేయడానికి ఆయ నెవరని ప్రశ్నించారు. ఇండియా వార్ గెలిచిందని గానీ.. పాక్ ఓడిందని, అది టెర్రరిస్టు దేశమని గానీ ఏ ఇంటర్నేష నల్ మీడియా చెప్పలేదన్నారు. ఆర్మీకి సంఘీభావం కోసం కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ చేసిందన్న కేశవరావు, బీజేపీ తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నట్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పహల్గాం దాడికి కారణమైన నలుగురు ఎక్కడని ప్రశ్నించారు. కవిత వాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదని, ఆమె నిజంగా పార్టీలో చేరితే లాభం జరుగుతుందంటే మాత్రం అభ్యంతరం లేదన్నారు.