TG : రేవంత్ ఆహ్వానానికి అమిత్ షా స్పందిస్తారా? బీజేపీ సెపరేట్ ప్రోగ్రామ్
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరు కావాలని నలుగురు కేంద్రమంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హెూం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖలు పంపించారు.
1948, సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని రేవంత్ కేంద్రమంత్రులను కోరారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.