ప్రేమోన్మాది పైశాచికానికి బలైన యువతి

Update: 2020-10-13 04:25 GMT

హైదరాబాద్ మేడిపల్లిలో ప్రేమోన్మోది పైశాచికానికి ఓ యువతి బలైంది. ప్రియుడి వేధింపులతో తీవ్ర మనస్థాపం చెంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది.. మొదట మాయ మాటలు చెప్పి ప్రేమించిన అజయ్‌.. తరువత తన వ్యక్తిగత ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. అయినా అజయ్‌ తీరు మారలేదు.. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేసేది లేదంటూ తరచూ వేధింపులకు దిగాడు.. దీంతో పరువు పోయిందని మనస్థాపం చెంది.. ట్రైన్‌ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 

Tags:    

Similar News