YS Sharmila: తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌, ఆయన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు: షర్మిల

YS Sharmila: తెలంగాణ వచ్చిన తర్వాత .. సీఎం కేసీఆర్‌... ఆయన కుటుంబం.. పార్టీ తప్పితే ఎవరు బాగుపడలేదన్నారు షర్మిల.

Update: 2022-06-25 13:30 GMT

YS Sharmila: తెలంగాణ వచ్చిన తర్వాత .. సీఎం కేసీఆర్‌... ఆయన కుటుంబం.. పార్టీ తప్పితే ఎవరు బాగుపడలేదన్నారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం ఇచ్చిన ఏ ఒక్క హామి కూడా నిలబెట్టుకోలేక పోయారని ఆమె విమర్శించారు. సూర్యాపేట జిల్లా పెను పహాడ్ మండలం తంగెళ్లగూడెం గ్రామంలో పాదయాత్న నిర్వహించారు. రాష్ట్రంలో భూ కబ్జాలకు అంతే లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌ లేకుండా చేశారని ఆమె దుయ్యబట్టారు. ఉద్యోగాల కల్పనపై తమ పార్టీ ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు.

Tags:    

Similar News