RCB విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నివేదికలో అసహజ మరణానికి సంబంధించిన కేసు అని ఉంది కానీ నిందితుల పేర్లు లేవు. 3 లక్షలకు పైగా ప్రజలు హాజరైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారని KA ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. 7వ నంబర్ గేటు వద్ద ఫ్రీగా టికెట్లు పంపిణీ చేస్తున్నారంటూ వదంతులు రావడంతో కొందరు అటుగా వెళ్లినట్లు సమాచారం. గేట్లు మూసి టికెట్లు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మరోవైపు బెంగళూరు తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తొక్కిసలాటలో 11మంది చనిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్దారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే, మేం ఏమైనా అన్నామా అంటూ బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు.