Odisha : కులాంతర ప్రేమ వివాహం.. గుండు కొట్టించారు

Update: 2025-06-13 16:23 GMT

వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు 40 మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితిలో జరిగింది. గోరఖ్‌పూర్‌ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, ఎస్సీ యువకుడు ప్రేమించుకున్నారు. యువతి తరఫు వారు ఈ బంధానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ జంట గురువారం గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండనం చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, నూతన జంటకు పెద్దకర్మ చేయాలని ఆదేశించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువుల్లో 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. 

Tags:    

Similar News