వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. ముంబై అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. ఏడేళ్లుగా చెక్ బౌన్స్ విచారణ జరుగుతుండగా.. వర్మ కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షలు పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు. 2018లో మహేష్చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.