భారీ వర్షాలకు పాకిస్తాన్లో 310 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు తోడు భారీ వర్షాలు ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగిస్తున్నాయి. వర్షాలు ధాటికి పాకిస్థాన్లో పలు;
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు తోడు భారీ వర్షాలు ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగిస్తున్నాయి. వర్షాలు ధాటికి పాకిస్థాన్లో పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది నివాసాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నదులను తలపించేలా కురిసిన వర్షాలతో దారులు పూర్తిగా ద్వంసమయ్యాయి. గడిచిన రెండున్నర నెలల్లో కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా 310మంది మృతి చెందగా 230 మంది గాయపడ్డారు. రుతుపనాలు ప్రారంభమైనప్పటి నుంచి నుంచి ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో 116 మంది, సింధ్ ప్రావిన్స్లో 136 మంది, బలూచిస్తాన్లో 21 మంది, పంజాబ్లో 16 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో 12 మంది మృతి చెందారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.