Balochis : పాక్ సైనికులపై విరుచుకుపడుతున్న బలూచీలు.. పలు ప్రాంతాలు స్వాధీనం

Update: 2025-05-10 05:45 GMT

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణలు కొనసాగుతుండగానే బలూచిస్థాన్‌ తమ స్వాతంత్ర్య పోరును ఉధృతం చేసింది. పాక్‌ సైనికులపై బలూచ్‌ తిరుగుబాటుదారులు విరుచుకు పడుతున్నారు. బలూచ్ ఉద్యమకారులు మూడు సమూహాలుగా విడిపోయి పాకిస్తాన్‌తో పోరాడుదున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలపై బూలచిస్తాన్‌ జెండాలను ఎగరేస్తున్నారు. తమను స్వాతంత్ర దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నారు. దీంతో భారత్‌ పాక్‌ ఘర్షణ సమయంలోనే పాక్‌ ముక్కలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News