Donald Trump : ఇండియాతో బిగ్ డీల్.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Update: 2025-06-28 11:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇండియాతో త్వరలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదు ర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చైనాతో ట్రేడీల్ కుదిరిందని చెప్పారు. వైట్ హౌస్లో 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై జరిగిన కార్యక్రమం లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రతిఒక్కరూ మాతో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని.. దానిలో భాగం కావాలని కోరుకుంటున్నారు.. నిన్ననే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. త్వరలో భారత్తో ఒక భారీ డీల్ చేసుకోబోతు న్నాం. అది చాలా పెద్దది. మేము ఇండియాలో మార్కెట్లను తెరవబోతున్నాం' అంటూ హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదన్నారు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెబుతామన్నారు. అదే సులువైన మార్గం' అని పేర్కొన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కొన్ని దేశాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా.. కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. వారితో ఎలాంటి ట్రేడ్ డీల్స్ ఉండవు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెప్తాం. అదే సులువైన మార్గం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాతో ఒప్పందం ద్వారా ఇండియా మార్కెట్‌‌‌‌ను మరింత జోరందుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాతో వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపు వంటి అంశాలపై అమెరికా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News