అండర్-19 ఆటగాడు ఆత్మహత్య
అతను స్టాండ్బై ఆటగాడిగా న్యూజిలాండ్ పర్యటన కోసం జట్టులో కూడా ఉన్నాడు.
నవంబర్ 14 న బంగ్లాదేశ్ మాజీ అండర్ -19 క్రికెటర్ మొహమ్మద్ సోజిబ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సోజిబ్ ( 21 ) రాజ్షాహికి చెందినవాడు. సైఫ్ హసన్ నాయకత్వంలోని అండర్ -19 ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను స్టాండ్బై ఆటగాడిగా న్యూజిలాండ్ పర్యటన కోసం జట్టులో కూడా ఉన్నాడు.
సోజిబ్ 2018 లో షైనెపుకూర్ కోసం తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు కాని మార్చి 2018 నుండి అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( బిసిబి ) గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ అబూ ఎనామ్ మొహమ్మద్ మాట్లాడుతూ రాబోయే బంగ్లా టి 20 కప్ కోసం అతడిని జట్టులోకి తీసుకోకపోవడం బాధించింది. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
"సోజిబ్ మా అండర్ -19 యొక్క 2018 బ్యాచ్లో సైఫ్ మరియు అఫీఫ్ (హుస్సేన్) తో కలిసి ఉన్నాడు. అతను ప్రపంచ కప్లో స్టాండ్బై. అతను శ్రీలంకతో పాటు ఆసియా కప్లో కూడా ఆడాడు. ఇది నిజంగా విచారకరం "అని అబూ అన్నారు.
అతడు డిప్రెషన్లో ఉన్నాడా లేదా మరేదైనా కారణమై ఉంటుందా అని చెప్పడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా అతను క్రికెట్లో రెగ్యులర్గా లేడు. బిసిబి డైరెక్టర్ ఖలీద్ మహముద్ మాట్లాడుతూ నేను విన్నదాన్ని నమ్మలేకపోతున్నాను. ఈ వార్త విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ ఓ యువ క్రీడాకారుడిని కోల్పోయిందని అన్నారు.