HAMAS: హమాస్ ఇంటెలిజెన్స్ అధిపతి హతం
గాజాపై ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో 400 మందికిపైగా మృతి;
ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ను తమ బలగాలు హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తబాష్ ఉగ్రవాద సంస్థ నిఘా, లక్ష్యాత్మక యూనిట్ విభాగానికి కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనపై హమాస్ ఇప్పటివరకు స్పందించలేదు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో 400 మందికిపైగా మృతి చెందగా... వందల మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను తిరస్కరించడంతోనే హమాస్పై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. బందీలను విడిచిపెట్టేవరకు గాజాలోని భూభాగాలను ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ అధిపతి రోనెన్ బార్ను తొలగించారు. గురువారం సాయంత్రమే ఇజ్రాయెల్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జెరూసలేంలో కొత్త నిరసనలకు దారితీసింది. వందలాది మంది ప్రదర్శనకారులను వీధుల్లోకి తీసుకువచ్చింది. ఈ కేసులో బార్పై అవిశ్వాసాన్ని నెతన్యాహు ఉదహరించారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 85 మంది మృతి
ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడింది. తాజాగా జరిపిన ఈ దాడుల్లో దాదాపు 85 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడంతో ఇజ్రాయెల్ దాడులతో రెచ్చిపోతోంది.
ట్రంప్ మరో కీలక నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన 5,32,000 మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. నెల రోజల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది.