Iran: టెల్ అవీవ్, జెరూసలెం నగరాలపై ఇరాన్ క్లిపణుల వర్షం
ఇజ్రాయెల్ లో ఆగకుండా మోగుతున్న వార్నింగ్ సైరన్లు;
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా దళాలు ఇజ్రాయెల్ సైనిక చర్యలో భాగంగా ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడి చేసిన కొన్ని గంటల్లోనే, ఇరాన్ ఆదివారం ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది.
ఇరాన్ రెండు విడతలుగా మొత్తం 27 క్షిపణులను ఇజ్రాయెల్లోని హైఫా, టెల్ అవీవ్ నగరాలపై ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడుల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. "ఇరాన్ మరోసారి క్షిపణులను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి" అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ట్వీట్ చేశాయి.
అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఫోర్డో, నతాన్జ్, ఇస్ఫహాన్లలోని మూడు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దళాలు దాడి చేశాయని తెలిపారు. ఈ దాడుల్లో బీ-2 బాంబర్లను ఉపయోగించినట్లు ఒక అమెరికా అధికారి రాయిటర్స్కు వెల్లడించారు. "ఈ దాడులు అద్భుతమైన సైనిక విజయం. ఇరాన్ కీలక అణు ఇంధన శుద్ధి కర్మాగారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి," అని ట్రంప్ ఒక టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు.