భారత్లో కరోనా విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణాలపై పలు దేశాల ఆంక్షలు..!
ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ నిషేధం విధించగా.. తాజాగా యూఏఈ, ఆస్ట్రేలియాలు ఆ జాబితాలో చేరాయి. భారత్ నుంచి దుబాయ్ మధ్య తిరిగే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.;
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ నిషేధం విధించగా.. తాజాగా యూఏఈ, ఆస్ట్రేలియాలు ఆ జాబితాలో చేరాయి. భారత్ నుంచి దుబాయ్ మధ్య తిరిగే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. ఏప్రిల్24 అర్ధరాత్రి నుంచి.. 10 రోజుల పాటు అన్ని తరగతుల విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అరబ్ఎమిరెట్స్తెలిపింది. గత 14 రోజుల్లో భారత్కు వచ్చిన వారు సైతం ఇతర దేశాల నుంచి రాకుండా ఆంక్షలు విధించింది. అయితే.. దుబాయ్ నుంచి భారత్కు వచ్చే విమానాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలులకు మినహాయింపునిచ్చింది.
ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు కరోనా ఉధృతి ఉన్న దేశాల నుంచి విమానాల రాకపోకలను తగ్గించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఆయా దేశాల నుంచి 30 శాతం మేర విమానాలను రద్దు చేయనున్నట్లు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే.. కరోనా ఉద్ధృతి ఉన్న దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరులపైనా ఆంక్షలు విధించామన్నారు. 14 రోజుల క్రితం ఆయా దేశాల్లో పర్యటిస్తే.. విమానం ఎక్కే 72 గంటల ముందే టెస్ట్ చేయించుకోవాలన్నారు.
ఇప్పటికే భారత్ను రెడ్ లిస్ట్లో పెట్టింది బ్రిటన్ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్రెడ్ లిస్ట్లో ఉన్న కారణంగా అదనపు విమానాలకు నిరాకరించింది లండన్లోని హీత్రోవ్ విమానాశ్రయం. భారత్ నుంచి 8 అదనపు విమానాలను అనుమతించాలని నాలుగు విమానయాన సంస్థలు చేసిన వినతిని తోసిపుచ్చింది. విమానాశ్రయంలో ఎక్కువ జనం గుమిగూడకుండా, పాస్పోర్ట్ తనిఖీ కేంద్రాల వద్ద బారులు తీరకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు విమానాశ్రయ అధికారులు.
మరోవైపు దేశీయ విమానాలపైనా కరోనా ప్రభావం పడింది. కలకత్తా, షిల్లాంగ్ నగరాల మధ్య రోజువారీ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది ఇండిగో సంస్థ. ఏప్రిల్ 23 నుంచి 8 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విమానయాన సిబ్బందికి బ్రీత్అనలైజర్ పరీక్షలను తక్షణమే నిలిపివేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏను కోరింది పైలట్ల సంఘం. ఈ యంత్రాలు తరుచుగా ఎక్కువగా ఉపయోగించటం ద్వారా ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్సోకే ప్రమాదం ఉందని పౌర విమానయాన డైరెక్టర్జనరల్అరుణ్కుమార్కు లేఖ రేసింది.