Pakistan : నేటి నుంచి పెట్రోల్ బంకులు బంద్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

Update: 2023-07-23 08:00 GMT

పాకిస్తాన్ ను ఆర్ధిక దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోవడంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో పాకిస్తాన్‎లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ దెబ్బకి పెట్రోల్ ధర రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్.


గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై 5%మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా, అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్యుల వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకే కాదు అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్ లో అధిక ద్రవ్యోల్భణం కారణంగా పాకిస్తాన్ కరెన్సీ బలహీన పడడమే ఇందుకు ప్రధాన కారణంగా డీలర్లు చెబుతున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ లోకి ఇరాన్ దేశానికి చెందిన ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేయడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News