వైసీపీ దిమ్మ తిరిగింది.. ఇకపై అంతా అన్‌స్టాపబుల్‌: చంద్రబాబు

వైసీపీ దిమ్మ తిరిగింది.. ఇకపై అంతా అన్‌స్టాపబుల్‌: చంద్రబాబు
X
2023 సంవత్సరం మార్చి23..23 ఓట్లు దేవుడు స్క్రిప్ట్‌ తిరిగ రాశాడు

మంగళగిరి కార్యాలంయంలో టీడీపీ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలోని 5 పార్లమెంట్ స్థానాల నేతలు, శ్రేణులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ శ్రేణులకు బాబు దిశానిర్దేశం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో రాష్ట్రానికి జరిగిన నష్టం వివరించామని అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల్లో చైతన్యం తెచ్చామన్నారు. ఈ మేరకు 108 నియోజకవర్గాల్లో సైకిల్‌ స్పీడ్‌ పెంచామని తెలిపారు.వైసీపీకి దిమ్మ తిరిగింది, ఆదెబ్బ కోలుకోకముందే మరో దెబ్బ కొట్టామని తెలిపారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలను బజారులో పశువుల్లా కొన్నారు. 2023 సంవత్సరం మార్చి23..23 ఓట్లు దేవుడు తిరిగి స్క్రిప్ట్‌ రాశాడు ఇకపై అంతా అన్‌స్టాపబుల్‌ అని శ్రేణుల్లో చంద్రబాబు ఉత్సాహాన్ని పెంచారు. ప్రజా వేదిక కూల్చి వేతతోనే జగన్‌ నిజస్వరూపం బయటపడిందన్నారు.

Tags

Next Story