మంత్రి జయరాంపై నారా లోకేష్ ఫైర్
By - Vijayanand |19 April 2023 10:33 AM GMT
మంత్రి గుమ్మనూరు జయరాంపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యమని అడిగితే బెంజ్ మంత్రి బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బెంజ్ మంత్రి వాల్మీకిలకు చేసిందేంటని ప్రశ్నించారు. బెంజ్ మంత్రి వందల ఎకరాలు అధిపతి అయ్యారని ఎద్దేవా చేశారు. భూములు రైతుల పేరిట రాయడానికి బెంజ్ మంత్రి సిద్దమా? అని సవాల్ విసిరారు. వాల్మీకిలకు టిడిపి.. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రంతో పోరాడతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com